తెలంగాణపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు దురదృష్టకరం: అనిల్ కూర్మాచలం

ABN , First Publish Date - 2022-02-09T16:54:22+05:30 IST

మంగళవారం రాజ్యసభ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు.

తెలంగాణపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు దురదృష్టకరం: అనిల్ కూర్మాచలం

-ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం

ఎన్నారై డెస్క్: మంగళవారం రాజ్యసభ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. రాష్ట్ర ఏర్పాటును వారు ఎంత వ్యతిరేకిస్తున్నరో తెలంగాణ ప్రజలకు అర్థం అవుతుందని తెలిపారు. ఒక పక్క రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదనుకుంటూనే ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని, బీజేపీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని లేకుంటే గతంలో వంద నియోజకవర్గాల్లో డిపాజిట్ గల్లంతు చేసినట్టే రాబోయే రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో అదే భంగపాటు తప్పదని అనిల్ హెచ్చరించారు. 


నాటి నుండి తెలంగాణ ప్రజల్ని బీజేపీ మోసం చేస్తూనే ఉందని దుయ్యబట్టారు. తెలంగాణ మీద అంత ప్రేమ ఉంటే ముందు విభజన హామీలు నెరవేర్చాలని  అనిల్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఓర్వలేక మోదీ విషం చిమ్ముతున్నారని విమర్శించారు. గత ఏడేళ్ల బీజేపీ ప్రభుత్వ హయాంలో తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకు చేసిన న్యాయం ఏంటో చెప్పాలన్నారు. అవకాశం ఉన్నప్పుడు అభివృద్ధి చేసే మనసు బీజేపీకి లేదని, తెలంగాణ మీద  చూపెడుతున్న వివక్షని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. సరైన సందర్భంలో బీజేపీకి తగిన బుద్ది చెప్తారని అనిల్ తెలిపారు. 

Updated Date - 2022-02-09T16:54:22+05:30 IST