NRI TDP మహానాడుకు శంఖారావం పూరించిన టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2022-04-28T00:19:30+05:30 IST

బోస్టన్ వేదికగా మే 20,21న ఎన్నారై టీడీపీ మహానాడు జరగనుంది. ఇందుకోసం టీడీపీ నేతలు శంఖారావం పూరించారు. ‘తెలుగుదేశం పిలుస్తోంది. రా.. కదలిరా..’ అనే పిలుపుతో 250 మందికిపైగా ఎన్నా

NRI TDP మహానాడుకు శంఖారావం పూరించిన టీడీపీ నేతలు

ఎన్నారై డెస్క్: బోస్టన్ వేదికగా మే 20,21న ఎన్నారై టీడీపీ మహానాడు జరగనుంది. ఇందుకోసం టీడీపీ నేతలు శంఖారావం పూరించారు. ‘తెలుగుదేశం పిలుస్తోంది. రా.. కదలిరా..’ అనే పిలుపుతో 250 మందికిపైగా ఎన్నారై తెలుగుదేశం కార్యకర్తలు హాజరవగా.. వారి కరతాళ ధ్వనుల మధ్య టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, విద్యా గారపాటి సమావేశమై ఎన్నారై టీడీపీ మహానాడుకు శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి తెలుగు మహిళలు పూలమాల వేసి జ్యోతిని వెలిగించారు. 



విద్యా గారపాటి మాట్లాడుతూ పార్టీ కోసం ప్రతి ఎన్నారై కార్యకర్త రోజుకు 15 నిమిషాలు సమయం కేటాయించాన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలకు పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు తెలిపి, వారిని ఆలోచింప చేయాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వంపై ఈ సందర్భంగా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా చూడాలనుకుంటే.. అంధకార ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని విచారం వ్యక్తం చేశారు. అనంతరం తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ.. తనదైన శైలిలో ప్రభుత్వ నియంతృత్వ పోకడలు ఎండగట్టారు. 60 నిముషాలు పాటు అనర్గళంగా తన వాక్చాతుర్యంతో NRI సోదర, సోదరీమణులను మంత్ర ముగ్దులను చేశారు. అనంతరం మహానాడు కేక్ కట్ చేసి, లోగోను మరియు టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత పెద్ద ఎత్తున పాల్గొని మహానాడుకు సిద్ధం అంటూ నినాదాలు చేశారు. తెలుగు మహిళలు తమ శైలిలో తెలుగుదేశం జెండాలను చేతబూని ‘జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జై చంద్ర బాబు, జై లోకేష్’ అని నినాదాలు చేశారు. మహానాడుకు సిద్ధం అనే నినాదాలతో కుల మతాలకి సభా ప్రాంగణాన్ని మారు మోగించారు.




Updated Date - 2022-04-28T00:19:30+05:30 IST