యాదాద్రికి కిలో బంగారం విరాళం ప్రకటించిన ఎన్ఆర్ఐ మల్లారెడ్డి
ABN , First Publish Date - 2022-01-01T20:17:17+05:30 IST
యాదాద్రి దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం ఎన్ఆర్ఐ ఫైళ్ళ మల్లారెడ్డి ఒక కిలో బంగారాన్ని విరాళంగా ఇచ్చారు.
హైదరాబాద్: యాదాద్రి దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం ఎన్ఆర్ఐ ఫైళ్ళ మల్లారెడ్డి ఒక కిలో బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని గచ్చిబౌలిలో ఆయన నివాసంలో కలిసి మల్లారెడ్డి చెక్కును అందించారు. యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ మహత్కార్యంలో భాగస్వామ్యం కల్పించినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు, మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి కి ఈ సందర్భంగా మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు పలువురు ముందుకొస్తున్నారని, దేవాదాయ శాఖ తరపున వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు.