ఇంత నీచంగా మాట్లాడ‌తారా?: NRI జయరాం కోమటి

ABN , First Publish Date - 2021-11-20T19:25:33+05:30 IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార పార్టీ చేస్తున్న దౌర్జ‌న్యాల‌కు అంతే లేకుండా పోతుంద‌ని, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై నీచ‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డ‌మే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని ఎన్నారై టీడీపీ నేత జయరాం కోమటి అన్నారు.

ఇంత నీచంగా మాట్లాడ‌తారా?: NRI జయరాం కోమటి

ఖండించిన ఎన్నారై టీడీపీ నేత జయరాం కోమటి

ఎన్నారై డెస్క్: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార పార్టీ చేస్తున్న దౌర్జ‌న్యాల‌కు అంతే లేకుండా పోతుంద‌ని, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై నీచ‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డ‌మే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని ఎన్నారై టీడీపీ నేత జయరాం కోమటి అన్నారు. రాష్ట్ర శాస‌న స‌భ‌లో చంద్ర‌బాబు, ఆయ‌న భార్య‌పై వైసీపీ నాయ‌కులు చేసిన దారుణ‌మైన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. అధికారం ఉంది క‌దా అని ఎలా ప‌డితే అలా మాట్లాడితే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు. అధికార ప్ర‌భుత్వ తీరును తప్పుప‌ట్టారు.


అసెంబ్లీలో త‌న భార్య‌పై వైసీపీ నాయ‌కులు నీచ‌మైన వ్యాఖ్య‌లు చేశార‌నే ఆవేద‌న‌తో స‌భ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన బాబు.. ఆ త‌ర్వాత ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ క‌న్నీటిప‌ర్యంత‌మైన విష‌యం తెలిసిందే. ఎన్నడూ బాబును అలా చూడ‌ని తెలుగు దేశం పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఒక్క‌సారిగా అలా క‌న్నీళ్లు పెట్టుకుంటూ చూసేస‌రికి తీవ్రంగా బాధ‌ప‌డ్డారు. వైసీపీ నాయ‌కుల తీరుకు వ్య‌తిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్నారై టీడీపీ నేత‌గా జ‌య‌రాం కూడా వైసీపీ నాయ‌కుల వ్యాఖ్య‌ల‌ను ఖండించారు.


రాజ‌కీయ నాయ‌కుల్లో హుందాతనం ఉండాల‌ని కానీ ఇలా మాట‌ల‌తో బ‌రితెగించ‌డం స‌రికాదంటూ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రాజ‌కీయాల‌ను వ్య‌క్తిగ‌త జీవితానికి ముడిపెడుతూ కుటుంబ స‌భ్యుల‌ను మాట‌ల‌న‌డం ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాద‌ని విచారం వ్య‌క్తం చేశారు. వైసీపీ నాయ‌కుల‌కు కూడా కుటుంబాలు ఉన్నాయ‌ని వాళ్ల‌కూ కుటుంబ స‌భ్యులు ఉన్నారని ఈ సంద‌ర్భంగా ఆయ‌న హెచ్చ‌రించారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన ప్ర‌జా నాయ‌కుణ్ని ఇలాంటి మాట‌ల‌తో బాధ పెట్ట‌డాన్ని త‌ప్పుప‌ట్టారు. ప్ర‌జ‌ల‌న్నీ చూస్తున్నార‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా అధికార అహంకారంతో ఉన్న వైసీపీకి బుద్ధి చెబుతార‌ని ఆయ‌న పేర్కొన్నారు.




Updated Date - 2021-11-20T19:25:33+05:30 IST