ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తెలుగు ఎన్నారై దంపతులు.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం!

ABN , First Publish Date - 2022-04-28T12:38:43+05:30 IST

ఆ దంపతులు ఇరువురూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు. తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. అప్పుడప్పుడూ స్వగ్రామానికి వచ్చి వెళ్లే వాళ్లు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితమే వచ్చిన ఆ కుటుంబం.. ఓ రోడ్డు ప్రమాదంలో ఛిద్రమైంది. దంపతులు దుర్మరణం పాలవగా.. వారి పిల్లలు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో ఉన్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం..

ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తెలుగు ఎన్నారై దంపతులు.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం!

ఇద్దరు పిల్లలు, డ్రైవరుకు తీవ్రగాయాలు

సూర్యాపేట, చివ్వెంల, ఏప్రిల్‌ 27: ఆ దంపతులు ఇరువురూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు. తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. అప్పుడప్పుడూ స్వగ్రామానికి వచ్చి వెళ్లే వాళ్లు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితమే వచ్చిన ఆ కుటుంబం.. ఓ రోడ్డు ప్రమాదంలో ఛిద్రమైంది. దంపతులు దుర్మరణం పాలవగా.. వారి పిల్లలు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో ఉన్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద హైదరాబాద్‌-విజయవాడ 65వ నెంబరు జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా రెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన పెద్దగమళ్ల హేమామ్‌ బ్రదర్‌ (42), భార్య రమాదేవి (39) ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పనిచేస్తూ.. అక్కడే స్థిరపడ్డారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ నెల 25నఈ కుటుంబం.. స్వగ్రామానికి వెళ్లే నిమిత్తం.. ఆస్ర్టేలియా నుంచి హైదరాబాద్‌ వచ్చింది. ఒకరోజు స్నేహితుడి ఇంట్లో బసచేసి.. బుధవారం తెల్లవారుజామునే ఏపీలోని స్వగ్రామానికి కారులో బయలుదేరింది.


ఈ క్రమంలో వేగంగా దూసుకుపోతున్న కారు.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వద్ద డబుల్‌బెడ్రూం ఇళ్ల సమీపంలోని కల్వర్టును బలంగా ఢీకొట్టింది. దీంతో.. హేమాంబరధర్‌తో పాటు అతడి భార్య రమాదేవి అక్కడికక్కడే మృతి చెందగా.. కుమారుడు ఫర్విత్‌, కుమార్తె భవజ్ఙ, డ్రైవర్‌ తిరుమలరావు.. తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. వారి స్వగ్రామమైన రెడ్డిగూడెంలో మృతదేహాలను ఉంచారు. జడ్పీటీసీ సభ్యుడు పాలంకి విజయభాస్కర రెడ్డి, పలువురు ప్రముఖులు సందర్శించి  నివాళులర్పించారు.

Updated Date - 2022-04-28T12:38:43+05:30 IST