తన తల్లిని సర్పంచ్‌గా ఎన్నుకున్న గ్రామానికి ఎన్నారై బంపర్ ఆఫర్..!

ABN , First Publish Date - 2021-11-14T02:19:41+05:30 IST

ఓ ఎన్నారై సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన తల్లిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ఎవ్వరూ ఊహించని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఒకటి కాదు.. రెండు కాదు..ఏకంగా కోటి రూపాయలు పెట్టి ఆ గ్రామంలో ఓ కొత్త పంచాయతీ భవనాన్ని నిర్మించారు.

తన తల్లిని సర్పంచ్‌గా ఎన్నుకున్న గ్రామానికి ఎన్నారై బంపర్ ఆఫర్..!

ఇంటర్నెట్ డెస్క్: ఓ ఎన్నారై సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన తల్లిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ఎవ్వరూ ఊహించని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఒకటి కాదు.. రెండు కాదు..ఏకంగా కోటి రూపాయలు పెట్టి ఆ గ్రామంలో ఓ కొత్త పంచాయతీ భవనాన్ని నిర్మించారు. దీంతో..ఈ ఉదంతం ప్రస్తుతం స్థానికంగానే కాకుండా దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. రాజస్థాన్ రాష్ట్రం బార్మర్ జిల్లాలోని బుఢాతల గ్రామంలో ఇటీవల చోటు చేసుకుందీ ఘటన. తన తల్లిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజల కోసం ఏదైనా చేయాల్సిన బాధ్యత తనమీద ఉందని ఎన్నారై నవల్ కిషోర్ వ్యాఖ్యానించారు. 


తన వ్యాపారమంతా విదేశాల్లోనే ఉన్నా కూడా గ్రామస్థులు తల్లిని గెలిపించారని ఆయన తెలిపారు. దీంతో.. ఈ విషయం తెలియగానే వారి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. ఆ తరువాత తన ఆలోచనకు కార్యరూపం ఇచ్చారు. సకల హంగులు, అత్యాధునిక సౌకర్యాలతో పంచాయతీ భవనాన్ని నిర్మించారు. సర్పంచ్ వార్డు సభ్యుల సమావేశాల కోసం ఆ భవనంలో ఓ పెద్ద హాలును నిర్మించారు. అంతేకాకుండా.. భవనం సుందరీకరణలో భాగంగా..పంచాయతీ చుట్టూ పెద్ద తోటను కూడా ఏర్పాటు చేశారు. కాగా.. ఇంతటి దాతృత్వం ప్రదర్శించిన ఎన్నారైపై అక్కడి గ్రామస్తులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

Updated Date - 2021-11-14T02:19:41+05:30 IST