ఉపాధి పనుల్లో గ్రామస్తులను భాగస్వామ్యం చేయాలి
ABN , First Publish Date - 2022-05-25T05:38:42+05:30 IST
ఉపాధి పనుల్లో గ్రామ ప్రజలను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని డ్వామా పీడీ ఎస్టీవీ రాజేశ్వరరావు అన్నారు.
కాళ్ళ, మే 24: ఉపాధి పనుల్లో గ్రామ ప్రజలను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని డ్వామా పీడీ ఎస్టీవీ రాజేశ్వరరావు అన్నారు. 2020–22 సంవత్సరాలకు సంబంధించిన పనుల సామాజిక తనిఖీ ప్రజా వేదిక కాళ్ళలో మంగళవారం నిర్వహించారు. 21 గ్రామాల్లో సుమారు రూ.14 కోట్లు ఉపాధి హామీ పనులు జరిగాయని పీడీ వివరించారు. గ్రామాల వారీగా సామాజిక ప్రజావేదిక నిర్వహించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి కొంత మొత్తం రికవరీ చేయాల్సి ఉందని జడ్పీ సీఈవో ఏవిఎస్ఆర్ రవికుమార్ తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఎటువంటి అవకతవకలకు పాల్పడినా శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఏపీడీ కనకదుర్గ, ఎంపీడీవో స్వాతి, ఎస్ఆర్పి తిరుమలరావు, హౌసింగ్ ఏఈ, జడ్పీటీసీ పచ్చిగోళ్ళ సోమేశ్వరరావు, బొండాడపేట సర్పంచ్ గోళ్ళ వెంకట సత్యనారాయణ, ఎంపీటీసీ పన్నాసి సూర్యకుమారి, టీఏలు తదితరులు పాల్గొన్నారు.