గ్రామాల్లో వేగంగా ఉపాధి పనులు
ABN , First Publish Date - 2022-05-26T05:30:00+05:30 IST
మండలంలో ఉపాధి పనులు వేగంగా జరగుతున్నాయని ఎంపీడీవో సంగాని వెంకటేశ్వరరావు తెలిపారు.
పాలకొల్లు రూరల్, మే 26: మండలంలో ఉపాధి పనులు వేగంగా జరగుతున్నాయని ఎంపీడీవో సంగాని వెంకటేశ్వరరావు తెలిపారు. మండలంలో జరుతున్న పను లను గురువారం ఆయన పరిశీలించారు. పంట బోదెలు కాలువలు, మురు బోదెలు తవ్వకం పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆమోదం పొందిన పనులు 478 కాగా పని దినాలుగా 189934 ఉన్నట్టు ఎంపీడీవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఎంపీడీవో వెంట ఈవోపీఆర్డీ ఎంఏ షరీఫ్, ఆయా గ్రామ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.