ఇప్పుడు రైతులే బాస్లు: బీజేపీ అధ్యక్షుడు నడ్డా
ABN , First Publish Date - 2020-09-20T23:22:03+05:30 IST
ఇప్పుడు రైతే బాస్. తనకు సంబంధించి తానే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడింది. కొత్త చట్టం రైతుల ఈ-మార్కెటింగ్ వేదికతో సహా ప్రత్యామ్నాయ మార్కెంటింగ్ మార్గాలకు అధికారం కల్పించింది
న్యూఢిల్లీ: పార్లమెంట్లో మూడు వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందడం పట్ల భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు రైతులే నిర్ణేతలని, వారి నిర్ణయాలు వారే తీసుకుంటారని ఆయన అన్నారు. నూతన చట్టం అందుకు తగిన స్వావలంభన ఇస్తుందని చెప్పుకొచ్చిన ఆయన ఇంట్లో కూర్చొనే రైతులు తమ సమస్యల్ని పరిష్కరించుకుంటారని అన్నారు.
‘‘ఇప్పుడు రైతే బాస్. తనకు సంబంధించి తానే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడింది. కొత్త చట్టం రైతుల ఈ-మార్కెటింగ్ వేదికతో సహా ప్రత్యామ్నాయ మార్కెంటింగ్ మార్గాలకు అధికారం కల్పించింది. దీని వల్ల రైతులు మంచి పారితోషికాన్ని పొందవచ్చు. అంతే కాకుండా రైతులు తమ సమస్యలను ఇక ఇంటి నుంచే పరిష్కరించుకోవచ్చు’’ అని నడ్డా అన్నారు.