ఉస్మానియాలో మందులు ఇక ఈజీ...
ABN , First Publish Date - 2022-05-15T13:48:09+05:30 IST
ఉస్మానియా ఆస్పత్రిలో మందుల కోసం ఇక నుంచి భారీ క్యూలో ఉండాల్సిన
- 11 ఫార్మసీ కౌంటర్ల ఏర్పాటు
హైదరాబాద్ సిటీ : ఉస్మానియా (Osmania ) ఆస్పత్రిలో మందుల (medicines) కోసం ఇక నుంచి భారీ క్యూలో ఉండాల్సిన అవసరం ఉండదు. తోపులాటలు ఉండవు. ఎందుకంటే సులభంగా మందుల సరఫరా కోసం ఆస్పత్రిలో అదనపు ఫార్మసీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆరు నుంచి పదకొండుకు పెంచారు.
రోజుకు 2 వేల మంది..
ఉస్మానియా ఆస్పత్రి ఓపీ ఫార్మసీ కౌంటర్లలో రోజుకు రెండు వేల మంది రోగులు మందులు తీసుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే కౌంటర్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ఆరు కౌంటర్లు సరిపోక లైన్లలో మందుల కోసం రోగులు ఘర్షణ పడేవారు. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఫార్మసీ కౌంటర్లను ఆధునీకరించారు. అంతేకాకుండా అవుట్ పేషెంట్లకు రిజిస్ట్రేషన్ సదుపాయం ఏర్పాటు చేశారు. పదకొండు కౌంటర్లు ఏర్పాటు చేసి వరుస క్రమంలో మందుల పంపిణీ నిర్వహించనున్నట్లు ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు.