తెలంగాణలో బీజేపీకి కలిసొచ్చిన November..!

ABN , First Publish Date - 2021-11-03T13:08:25+05:30 IST

బీజేపీ పార్టీకి నవంబరు నెల కలిసోస్తుంది. గత ఏడాది ...

తెలంగాణలో బీజేపీకి కలిసొచ్చిన November..!

కరీంనగర్ /హుజూరాబాద్‌ : బీజేపీ పార్టీకి నవంబరు నెల కలిసోస్తుంది. గత ఏడాది నవంబరులో దుబ్బాక ఉప ఎన్నిక జరగగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన్‌ రావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఏడాది నవంబరులో కూడా హుజూరాబాద్‌ ఉప ఎన్నిక జరగగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్‌ విజయం సాధించారు. రెండు చోట్ల ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌పై బీజేపీ గెలవడం గమనార్హం. ఈ రూపంలో నవంబరు నెల ఉప ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌కు చేదు అనుభవాలను మిగిల్చితే.. బీజేపీకి మాత్రం తీపి జ్ఞాపకాలను మిగిల్చాయి.


అయితే.. ఈ ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఒకవేళ సెంటిమెంట్‌గానే భావించాల్సి వస్తే.. ఫలితాలు వెలువడ్డ రోజును కాకుండా పోలింగ్‌ జరిగిన రోజును పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ నవంబరు 3న జరగగా, హుజూరాబాద్‌ పోలింగ్‌ అక్టోబరు 30న జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.

Updated Date - 2021-11-03T13:08:25+05:30 IST