జొకోవిచ్‌ రూ. 8 కోట్ల విరాళం

ABN , First Publish Date - 2020-03-28T09:51:55+05:30 IST

టెన్నిస్‌ వరల్డ్‌ నెంబర్‌ వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ కరోనా బాధితులను ఆదుకునేందుకు సెర్బియా ప్రభుత్వానికి రూ.8.3 కోట్లను విరాళంగా ఇచ్చాడు..

జొకోవిచ్‌ రూ. 8 కోట్ల విరాళం

బెల్‌గ్రేడ్‌ (సెర్బియా): టెన్నిస్‌ వరల్డ్‌ నెంబర్‌ వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ కరోనా బాధితులను ఆదుకునేందుకు సెర్బియా ప్రభుత్వానికి రూ.8.3 కోట్లను విరాళంగా ఇచ్చాడు. ఆక్సిజన్‌ సిలిండర్లు, వైద్య పరికరాలు, శానిటరీ వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ విరాళం ఇచ్చినట్టు జొకో తెలిపాడు. కాగా స్విస్‌ స్టార్‌  రోజర్‌ ఫెడరర్‌ కరోనాపై పోరుకు దాదాపు రూ. 7 కోట్లు విరాళమిచ్చిన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-03-28T09:51:55+05:30 IST