నోటిఫికేషన్లు విడుదల చేయాలి
ABN , First Publish Date - 2021-04-21T05:42:26+05:30 IST
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫి కేషన్లను విడుదల చేయాలని, నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని భిక్కనూరులో ఏబీవీపీ ప్రతినిధులు ప్రభుత్వ, మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
భిక్కనూరు, ఏప్రిల్ 20: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫి కేషన్లను విడుదల చేయాలని, నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని భిక్కనూరులో ఏబీవీపీ ప్రతినిధులు ప్రభుత్వ, మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ మేరకు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గందం సంజయ్ మాట్లాడుతూ యూనివర్సిటీ లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో శాంతియుతంగా ఉద్యోగాల నోటిఫికేషన్ను జారీ చేయాలని నిరసన తెలిపిన ఏబీవీపీ నాయకులపై దాడి చేసిన పోలీ సులపై, టీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్ర మంలో ఏబీవీపీ ప్రతినిధులు సమీర్, రాజేందర్, శివ, చందు, ప్రణీత్, నితిన్, దత్తు, నవీన్, రాంచంద్రం, తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డిటౌన్: రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లపై అలసత్వం వీడా లని కరీంనగర్లో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ను అడ్డుకుని నిరసన తెలి పిన ఏబీవీపీ నాయకులపై దాడికి పాల్పడిన టీఆర్ఎస్ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఎస్ఎప్డీ జిల్లా కన్వీనర్ కృష్ణ అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరితే దాడు లు చేయడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గసభ్యుడు నరేందర్, అరుణ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.