ఉత్తరాఖండ్‌కు మరో రాజధాని

ABN , First Publish Date - 2020-06-09T00:06:25+05:30 IST

ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కొత్తగా మరో రాజధాని ఏర్పాటైంది. మంగళవారం నుంచి ఈ రాజధాని అధికారికంగా మనుగడలోకి రానుంది. సోమవారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. కొత్తగా ఏర్పాటైన రెండవ రాజధాని ‘గైర్‌సైన్’. ఇది వేసవి రాజధానిగా ఉంటుంది. రెండవ రాజధాని ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ ఆమోద ముద్ర వేసిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమవారం వెలువరించారు.

ఉత్తరాఖండ్‌కు మరో రాజధాని

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కొత్తగా మరో రాజధాని ఏర్పాటైంది. మంగళవారం నుంచి ఈ రాజధాని అధికారికంగా మనుగడలోకి రానుంది. సోమవారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. కొత్తగా ఏర్పాటైన రెండవ రాజధాని ‘గైర్‌సైన్’. ఇది వేసవి రాజధానిగా ఉంటుంది. రెండవ రాజధాని ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ ఆమోద ముద్ర వేసిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమవారం వెలువరించారు. 


చమోలి జిల్లాలో ఉన్న కొత్త రాజధాని గైర్‌సైన్‌ను  వేసవి రాజధానిగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర శాసనసభ ఇటీవలే తీర్మానించింది. వేసవి రాజధాని ఏర్పాటు చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి రావత్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-06-09T00:06:25+05:30 IST