హైదరాబాద్: తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. గురువారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇటీవల టీఆర్ఎస్ నేత బండ ప్రకాష్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఖాళీ అయిన ఆ స్థానానికి ఈసీ షెడ్యూల్ను విడుదల చేసింది. మే 12న నోటిఫికేషన్ విడుదలకానుంది. మే 19న నామినేషన్లకు చివరి తేదీగా ప్రకటించింది. మే 30న పోలింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు జరుగనుంది.
ఇవి కూడా చదవండి