అధ్యాపకుల పోస్టులకు నోటిఫికేషన్
ABN , First Publish Date - 2020-06-02T09:14:02+05:30 IST
గురుకుల పాఠశాలలో అధ్యాపకుల పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని పరిగి బాలిక గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సుమతి తెలిపారు.
చేవెళ్ల: గురుకుల పాఠశాలలో అధ్యాపకుల పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని పరిగి బాలిక గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సుమతి తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ గిరిజన గురుకుల పాఠశాలలో గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష శ్రాస్తం, జీవ శాస్త్రం సబ్జెక్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. 6లోగా ఆసక్తి గలవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.