జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు నోటిఫికేషన్
ABN , First Publish Date - 2020-07-03T10:44:56+05:30 IST
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పుర స్కారాలు- 2019కి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 12వ తేదీలోగా ఆన్లైన్లో ప్రతిపాదనలు
ఏలూరు ఎడ్యుకేషన్, జూలై 2: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పుర స్కారాలు- 2019కి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 12వ తేదీలోగా ఆన్లైన్లో ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది. టీచర్లు అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలతో సహా ప్రతిపాదనలను, ఇతర వివరాలనువెబ్సైట్ నుంచి పొందవచ్చు.
నుంచి అందిన ప్రతిపాదనలను షార్ట్ లిస్టు చేసి స్టేట్ సెలక్షన్ కమిటీ ద్వారా నేషనల్ జ్యూరీకి పంపిస్తారు. జాతీయస్థాయిలో ష్టార్ట్లిస్టు అయిన అభ్యర్థులతో ముఖాముఖీ లేదా వీడియో కాన్ఫరెన్సు ద్వారా ముఖాముఖి కోసం సమాచారాన్ని ఆగస్టు 3న పంపిస్తారు. ష్టార్ట్ లిస్టు అయిన అభ్యర్థులకు వీడియో కాన్ఫరెన్సు లేదా ఫిజికల్ ఇంట్రా క్షన్స్ ను ఇండిపెండెంట్ నేషనల్ జ్యూరీ ఆగస్టు ఆరు నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తుంది. తుదిగా ఎంపికైన వారిని ఆగస్టు 14న ఖరారు చేస్తుంది.