మునిసిపల్‌ కార్మికుల సమ్మె నోటీసు

ABN , First Publish Date - 2022-07-03T05:26:58+05:30 IST

ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 11 నుంచి మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నట్లు మున్సిపల్‌ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌వై.నాయుడు తెలిపారు. ఈ మేరకు శనివారం ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రాజన్నదొరకు సమ్మె నోటీసు అందించారు.

మునిసిపల్‌ కార్మికుల సమ్మె నోటీసు

11 నుంచి చేపట్టనున్నట్లు వెల్లడి

ఉప ముఖ్యమంత్రికి అందజేత 

సాలూరు,జూలై 2: ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 11 నుంచి మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నట్లు  మున్సిపల్‌ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌వై.నాయుడు తెలిపారు. ఈ మేరకు శనివారం ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రాజన్నదొరకు సమ్మె నోటీసు అందించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ..  11వ వేతన సవరణ కమిటీ సిఫారసుల మేరకు మునిసిపల్‌ కార్మికులకు  నెలకు రూ.20 వేలు జీతం,  కరువు భత్యం చెల్లించాలని,   సచివాలయ ఉద్యోగులతో పాటు వారిని పర్మినెంట్‌ చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు.  కరోనా కాలంలో పనిచేసిన కార్మికులకు తక్షణం బకాయిలు చెల్లించి,  విధుల్లో కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.  


 

Updated Date - 2022-07-03T05:26:58+05:30 IST