అలాంటిదేమీ జరగలేదు!
ABN , First Publish Date - 2021-10-19T08:51:02+05:30 IST
టీఆర్ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్ష ఉమ్మడి సమావేశం సందర్భంగా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఎన్ని ఉన్నాయంటూ సీఎం కేసీఆర్ తనను ప్రశ్నించినట్లు వచ్చిన వార్తలను తాను ఖండిస్తున్నానని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.
బస్సుల లెక్కపై మంత్రి పువ్వాడ వివరణ
టీఆర్ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్ష ఉమ్మడి సమావేశం సందర్భంగా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఎన్ని ఉన్నాయంటూ సీఎం కేసీఆర్ తనను ప్రశ్నించినట్లు వచ్చిన వార్తలను తాను ఖండిస్తున్నానని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. సమావేశంలో అలాంటి ప్రస్తావన కానీ.. మంత్రి కేటీఆర్ సెటైర్ వేయడం కానీ జరగలేదని వివరణ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.