మడి కాదు..మట్టిరోడ్డు

ABN , First Publish Date - 2022-07-05T04:57:41+05:30 IST

మడి కాదు..మట్టిరోడ్డు

మడి కాదు..మట్టిరోడ్డు

బురదమయంగా జినుగుర్తి-ఆడ్కిచర్ల రహదారి

తాండూరు రూరల్‌, జూలై4: పక్క ఫొటోలో కనిపిస్తోంది సాగుకోసం సిద్ధం చేసిన మడి కాదు... ఇటీవల కురిసిన వర్షాలకు బురదమయంగా మారిన జినుగుర్తి-ఆడ్కిచర్ల రహదారి. ఈ రహదారి పూర్తిగా బురదమయంగా మారడంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. కనీసం కాలినడకన కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ మార్గంలో తారురోడ్డు వేసేందుకు ప్రభుత్వం రూ.25కోట్లు మంజూరు చేసింది. నాలుగేళ్లుగా రోడ్డు పనులు మందకొడిగా సాగడంతో చినుకు పడితే చిత్తడిగా మారిపోయి వాహనాలు బురదలో  దిగబడుతున్నాయి. రాత్రివేళల్లో అయితే ఈ రోడ్డుపై ప్రయాణం నరకమేనని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఈ రోడ్డు 12 కిలో మీటరు వరకు ఇలాగే ఉండటంతో జినుగుర్తి, సంకిరెడ్డిపల్లి, జినుగుర్తితండా, ఉద్దండాపూర్‌, గుండ్లమడుగుతండా, మైసమ్మగడ్డ తండా, ఆడ్కిచర్ల, బాయిమీది తండా తదితర గ్రామాలకు వెళ్లాలంటే ఈ రోడ్డు ప్రధానంగా మారడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

Updated Date - 2022-07-05T04:57:41+05:30 IST