మంత్రులు కాదు.. జనాభా లెక్కలు కావాలి: జాజుల

ABN , First Publish Date - 2022-08-10T10:12:54+05:30 IST

బీసీలకు 27 మంత్రి పదవులు ఇచ్చామని ప్రధాని మోదీ చెప్పుకోవడం కాదని.

మంత్రులు కాదు.. జనాభా లెక్కలు కావాలి: జాజుల

న్యూఢిల్లీ, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): బీసీలకు 27 మంత్రి పదవులు ఇచ్చామని ప్రధాని మోదీ చెప్పుకోవడం కాదని.. దేశంలో బీసీల జనాభా లెక్కలు ప్రకటించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. బీసీల డిమాండ్ల పరిష్కారానికి ఆయన ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. బీసీల జనాభా లెక్కలు తీసి దామాషా ప్రకారం రిజర్వేషన్లను కల్పించాలని, కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-08-10T10:12:54+05:30 IST