ఆరు గంటలు కూడా నిద్రపోవడం లేదు..

ABN , First Publish Date - 2020-05-27T06:49:52+05:30 IST

లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చినప్పటీ నుంచి దేశంలో నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగినట్లు

ఆరు గంటలు కూడా నిద్రపోవడం లేదు..

  • 44% మందిది ఇదే పరిస్థితి

న్యూఢిల్లీ మే 26: లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చినప్పటీ నుంచి దేశంలో నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగినట్లు వివిధ అధ్యయనాల్లో తేలింది. కొందరు అతినిద్రతో, మరికొంత మంది నిద్రలేమితో సతమవుతున్నట్లు ఈ సర్వేల్లో వెల్లడైంది. వేక్‌ ఫిట్‌.కో సంస్థ చేసిన సర్వే ప్రకారం 44 శాతం మంది ఆరు గంటల కంటే తక్కువ సమయం నిద్ర పోతున్నారు.


అదే సమయంలో నిద్రలేమితో బాధపడే వారి సంఖ్య 26 శాతం తగ్గినట్లు బెంగళూరు సంస్థ స్లీప్‌ సొల్యూషన్‌ చేపట్టిన సర్వేలో తెలిసింది. లాక్‌డౌన్‌ కారణంగా పెరుగుతున్న ఆందోళనలే ఇందుక్కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘‘ఇంట్లోంచి బయటకు రాకపోవడం, ఉద్యోగం, ఆర్థిక భద్రత వంటి అంశాలపట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇవి నిద్రను ప్రభావితం చేస్తున్నాయని’’ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ (నిమ్‌హాన్స్‌) న్యూరోఫిజిషియన్‌ గుల్షన్‌ కుమార్‌ అన్నారు.

Updated Date - 2020-05-27T06:49:52+05:30 IST