ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదు: నార్త్ కొరియా

ABN , First Publish Date - 2021-06-23T09:06:22+05:30 IST

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో వణికిపోతోంది. కొత్త వేరియంట్లు వివిధ దేశాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.

ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదు: నార్త్ కొరియా

ప్యాంగ్యాంగ్: ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో వణికిపోతోంది. కొత్త వేరియంట్లు వివిధ దేశాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా తమ దేశంలో మాత్రం ఒక్క కరోనా పాజిటివ్ కేసూ నమోదు కాలేదని ఉత్తర కొరియా చెప్తోంది. జూన్ 10 నాటికి 30వేల మందికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించామని, కానీ ఎవరికీ కరోనా పాజిటివ్ ఫలితం రాలేదని అధికారులు తెలిపారు. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ దేశంలో కరోనా పరిస్థితులపై స్పందించింది. ఈ నెల 4 నుంచి 10లోపు నార్త్ కొరియాలో 733 మందికి మాత్రమే కరోనా పరీక్షలు చేశారని తెలిపింది. వీరిలో కూడా 149 మంది ఇన్‌ఫ్లూయెంజా వంటి లక్షణాలు కనిపించినట్లు వివరించింది.

Updated Date - 2021-06-23T09:06:22+05:30 IST