ఉత్తరకొరియాతో ప్రాంతీయ భద్రతకు ముప్పు.. బ్రిటన్
ABN , First Publish Date - 2022-01-16T03:08:10+05:30 IST
వరుసగా క్షిపణులు ప్రయోగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్న ఉత్తరకొరియాపై బ్రిటన్ తాజాగా అగ్గిమీద గుగ్గిలమైంది.
ఇంటర్నెట్ డెస్క్: వరుసగా క్షిపణులు ప్రయోగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్న ఉత్తరకొరియాపై బ్రిటన్ తాజాగా అగ్గిమీద గుగ్గిలమైంది. ప్రాదేశిక భద్రతకు శాంతియుత వాతావరణానికి ఉత్తరకొరియా ఓ మప్పుగా మారిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం నాడు ఉత్తరకొరియా ఓ రైలుపై నుంచి మిసైల్ను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ క్షిఫని ప్రయోగం జరిగిన కొద్ది గంటలకే బ్రిటన్ ఉత్తరకొరియా దూకుడును ఖండిస్తూ ఘాటు ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇలాంటి రెచ్చ గొట్టే చర్యలను కట్టిపెట్టి అమెరికాలో చర్చలు ప్రారంభించాలని మేము ఉత్తరకొరియాను కోరుతున్నాం’’ అని బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి పేర్కొన్నారు.