ఆగని కరోనా మరణాలు
ABN , First Publish Date - 2020-09-22T08:02:42+05:30 IST
జిల్లాలో కరోనాతో మరో ఐదుగురు మర ణించినట్టు అధికారులు సోమవారం హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. దీంతో మొత్తం మృ తుల సంఖ్య 451కి పెరిగింది. అలాగే మరో 505 మంది కొత్తగా కరోనా బారిన
మరో ఐదుగురి మృతి.. కొత్తగా 505 పాజిటివ్ కేసులు
అనంతపురం వైద్యం, సెప్టెంబరు 21: జిల్లాలో కరోనాతో మరో ఐదుగురు మర ణించినట్టు అధికారులు సోమవారం హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. దీంతో మొత్తం మృ తుల సంఖ్య 451కి పెరిగింది. అలాగే మరో 505 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 53342కి చేరింది. ఇందులో 49895 మంది కరోనా నుంచి కోలుకోగా మిగతా వా రు చికిత్స పొందుతున్నారు. జిల్లాలో 40 మం డలాలలో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
జిల్లా కేంద్రంలోనే అత్యధికంగా 142 కేసులు నమోదయ్యాయి. అమరాపురంలో 49, కదిరిలో 41, తాడిపత్రిలో 41, హిందూపురంలో 30, ధర్మవరంలో 27, పుట్టపర్తిలో 25, బుక్కపట్నంలో 23, కొత్తచెరువులో 12, నల్లచెరువులో 12, కళ్యాణదుర్గంలో 11, గుమ్మఘట్టలో 9, కణేకలుల్లో 9, బత్తలపల్లి, బ్రహ్మసముద్రంలో 6, మడకశిర, బీకేఎస్, రొద్దంలో 5, గుంతకల్లు, కనగానపల్లి, లేపాక్షి, పెనుకొండలో 4, గుడిబండ, నార్పల, పరిగి, రాప్తాడులో 3, ఎన్పీకుంటలో 2, మరో 13 మండలాలలో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇతర జిల్లాలకు చెందిన వారు ముగ్గురున్నారు.
నేడు కరోనా నమూనాలు సేకరించే ప్రాంతాలివే...
జిల్లాలో మంగళవారం హిందూపురం, మడకశిర, పుట్టపర్తి, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, గుత్తి, పామిడి, రా యదుర్గం, కళ్యాణదుర్గం, కదిరి, ఓ డీసీ, అమడగూరు, గాండ్లపెంట, ఎ న్పీకుంట, తలుపుల, కురుగుంట, బీకేఎస్, రాప్తాడు, కొర్రపాడు, కూడే రు, ఆత్మకూరు, సీకేపల్లి, ఎన్ఎ్సగేట్, బత్తలపల్లి, కనగానపల్లి, లేపాక్షి, చిలమత్తూరు, పరిగి, సోమందేపల్లి, శెట్టూరు, బ్రహ్మస ముద్రం, వజ్రకరూరు, జిల్లా కేంద్రంలోని మున్సిపల్ గెస్ట్హౌస్, పాతూరు ఆస్పత్రి, ప్రభుత్వ బాలుర జూని యర్ కళాశాలలో నమూనాలు సేకరిస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు.