ఆగని అదానీ షేర్ల పతనం..

ABN , First Publish Date - 2021-06-17T08:56:50+05:30 IST

అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లలో బుధవారం మళ్లీ అమ్మకాలు పోటెత్తాయి. దీంతో అదానీ పోర్ట్స్‌ 7.17 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 5.77 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 5 శాతం, అదానీ టోటల్‌ గ్యాస్‌ 5 శాతం,

ఆగని అదానీ షేర్ల పతనం..

ముంబై: అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లలో బుధవారం మళ్లీ అమ్మకాలు పోటెత్తాయి. దీంతో అదానీ పోర్ట్స్‌ 7.17 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 5.77 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 5 శాతం, అదానీ టోటల్‌ గ్యాస్‌ 5 శాతం, అదానీ పవర్‌ 4.97 శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 3.10 శాతం మేర నష్టపోయాయి. ఇందులో అదానీ టోటల్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ పవ ర్‌ షేర్లు.. లోయర్‌ సర్క్యూట్‌ బ్రేకర్‌ను తాకాయి. మరోవైపు సెన్సెక్స్‌ 271.07 పాయింట్ల నష్టంతో 52,501.98 దగ్గర క్లోజవగా నిఫ్టీ 101.70 పాయింట్ల నష్టంతో 15,767.55 వద్ద ముగిసింది. కాగా సబ్‌స్ర్కిప్షన్‌ ప్రారంభమైన తొలిరోజే దొడ్ల డెయి రీ ఇష్యూ 1.4 రెట్లు సబ్‌స్ర్కైబ్‌ అయింది. ఇష్యూ ద్వారా మొ త్తం 85,07,569 షేర్లను ఆఫర్‌ చేయగా 1,19,38,955 షేర్లకు బిడ్స్‌ను అందుకుంది. కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఇష్యూ కూడా 27 శాతం సబ్‌స్ర్కైబ్‌ అయింది. మొత్తం 1,44,13,073 షేర్లను  ఆఫర్‌ చేయగా 38,57,274 షేర్లకు బిడ్లు వచ్చాయి.

Updated Date - 2021-06-17T08:56:50+05:30 IST