బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి ఆ నీరే కారణమవుతోందా?
ABN , First Publish Date - 2021-05-15T16:11:27+05:30 IST
ఒకవైపు కరోనాతో తీవ్రంగా అల్లాడుతున్న దేశాన్ని మరోవైపు బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది.
ఒకవైపు కరోనాతో తీవ్రంగా అల్లాడుతున్న దేశాన్ని మరోవైపు బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న రోగులకు సోకుతూ ప్రాణాంతకంగా మారుతోంది. కోవిడ్ చికిత్స కోసం స్టిరాయిడ్లు ఎక్కువగా ఉపయోగిస్తుండడంతో రోగిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వారిపై వాతావరణంలో ఉండే మ్యూకోర్మైకోసిస్ దాడి చేసి శరీరంలోని కీలక అవయవాలను దెబ్బతీస్తోంది. కోవిడ్ చికిత్స తీసుకున్న రోగులకు బ్లాక్ ఫంగస్ సోకుతుండడానికి గల మరో కారణాన్ని అహ్మదాబాద్కు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ అతుల్ అభ్యంకర్ తాజాగా బయటపెట్టారు.
ఆక్సిజన్ ఎక్కించేటపుడు ఉపయోగించే హ్యుమిడిఫయర్లే బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి ప్రధాన కారణమని అతుల్ అభిప్రాయపడుతున్నారు. `ఆక్సిజన్కు ఉపయోగించే హ్యుమిడిఫయర్లలో స్టెరైల్ నీటినే వాడాలి. కానీ, ప్రైవేట్ హాస్పిటల్స్లోనూ, కోవిడ్ సెంటర్లలోనూ, ఇళ్లలో ఆక్సిజన్ పెట్టుకుంటున్న వారు సాధారణ నీటనే వాడేస్తున్నారు. ఆ నీటిలో ఉండే సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించి బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి కారణమవుతున్నాయి. దీనిని నివారించాలంటే హ్యుమిడిఫయర్ను ఎప్పటికపుడు శుభ్రం చేయాలి. రోజుకు రెండు సార్లు నీటిని మార్చాల`ని సూచించారు.