కన్నబాబు, అంబటికి నాన్ బెయిలబుల్ వారంట్లు
ABN , First Publish Date - 2021-03-06T08:35:36+05:30 IST
ఏపీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులకు తెలంగాణలోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేసింది.
మంగళ్హాట్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఏపీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులకు తెలంగాణలోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేసింది. హెరిటేజ్ కేసులో వీరిద్దరూ శుక్రవారం కోర్టుకు హాజరు కాలేదు. దీంతో వచ్చే వాయిదా(ఈనెల 24)కు తప్పనిసరిగా హాజరుకావాలంటూ ఈ వారంట్లు జారీ చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టివిక్రమార్కతో పాటు మరో 44 మందిపై ముదిగొండలో నమోదైన కేసునూ కోర్టు విచారించింది. తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా పడింది.