నిత్యానందకు నాన్బెయిలబుల్ వారెంట్
ABN , First Publish Date - 2022-08-20T06:39:42+05:30 IST
నిత్యానంద స్వామికి రామనగర అదనపు జిల్లా సెషన్స్ కోర్టు మరో సారి నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
బెంగళూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): నిత్యానంద స్వామికి రామనగర అదనపు జిల్లా సెషన్స్ కోర్టు మరో సారి నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2010లో నిత్యానందపై అత్యాచారం కేసు నమోదైంది. 2019 నుంచి ఆయన వాయిదాలకు రాకపోవడంతో ఎన్బీడ బ్ల్యూ జారీ అయింది. శుక్రవారం కేసు విచారణకు రాగా, మరోసారి న్యాయమూర్తి వారెంటు జారీ చేశారు. నిత్యా నందను సెప్టెంబరు 23లోగా కోర్టుకు హాజరు పరచాలని ఆదేశించారు. నిత్యానంద కైలాసం అనే ప్రత్యేక దేశాన్ని ఏర్పాటుచేసుకుని అక్కడే ఉంటున్న విషయం తెలిసిందే.