నేడు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు
ABN , First Publish Date - 2021-03-04T08:47:55+05:30 IST
నేడు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు
అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే కోటా ఎమెల్సీ స్థానాలకు వైసీపీ తరఫున ఆరుగురు అభ్యర్థులు గురువారం నామినేషన్లు వేయనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముందుగా సీఎం జగన్ను అభ్యర్థులు మహమ్మద్ ఇక్బాల్, సి.రామచంద్రయ్య, చల్లా భగీరథరెడ్డి, బల్లి కల్యాణ చక్రవర్తి, కరీమున్నీసా, దువ్వాడ శ్రీనివాస్ కలుస్తారు. అనంతరం వారు నేరుగా శాసనమండలి కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్లు సమర్పిస్తారు.