పెళ్లి కావడం లేదని బెంగ పెట్టుకున్నాడు.. చివరకు మాంత్రికుడిని కలిసి అతను ఎంత పని చేశాడంటే..

ABN , First Publish Date - 2022-03-16T21:37:26+05:30 IST

ప్రస్తుత సమాజం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించింది. సాంకేతికత సహాయంతో దూసుకుపోతోంది.

పెళ్లి కావడం లేదని బెంగ పెట్టుకున్నాడు.. చివరకు మాంత్రికుడిని కలిసి అతను ఎంత పని చేశాడంటే..

ప్రస్తుత సమాజం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించింది. సాంకేతికత సహాయంతో దూసుకుపోతోంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా మూఢ నమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. మాంత్రికులను ఆశ్రయించి వారిని గుడ్డిగా అనుసరించే వ్యక్తులు ఇప్పటికీ చాలా చోట్ల ఉన్నారు. తనకు పెళ్లి కావడం లేదని బెంగ పెట్టుకున్న ఓ యువకుడు ఓ మాంత్రికుడి మాటలు నమ్మి నరబలికి సిద్ధం కావడం తాజాగా సంచలనంగా మారింది. 


ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాకు సమీపంలోని చిజార్సీ గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక ఈ నెల 13న అదృశ్యమైంది. తల్లిదండ్రులు, బంధువులు ఎంత వెతికినా ఆ బాలిక దొరకలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు గ్రామంలోని కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో షాకింగ్ విషయం బయటపడింది. బాలిక ఎదురింట్లో ఉండే యువకుడికి పెళ్లి కావడం లేదు. ఎన్ని సంబంధాలు చూసినా వివాహం సెట్ కాకపోవడంతో అతను ఓ మాంత్రికుడిని ఆశ్రయించాడు. 


హోలీ పౌర్ణిమ రోజు ఓ బాలికను బలిస్తే.. వివాహం జరుగుతుందని ఆ యువకుడికి మాంత్రికుడు చెప్పాడు. మాంత్రికుడి మాటలను గుడ్డిగా నమ్మిన నిందితుడు ఆ బాలికను కిడ్నాప్ చేశాడు. ఆమెను రహస్యప్రదేశంలో దాచి ఉంచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మొత్తం అంతా గాలించి నిందితుడు ఉన్న ప్రదేశాన్ని కనుగొన్నారు. బాలికను సురక్షితంగా విడిపించారు. యువకుడిని అరెస్ట్ చేశారు. మాంత్రికుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. 

Updated Date - 2022-03-16T21:37:26+05:30 IST