ఆకాశ ఎయిర్‌కు ఎన్‌ఓసీ

ABN , First Publish Date - 2021-10-13T01:37:11+05:30 IST

భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆకాశ ఎయిర్‌కు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎన్‌ఓసీ జారీ చేసింది.

ఆకాశ ఎయిర్‌కు ఎన్‌ఓసీ

ముంబై : భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆకాశ ఎయిర్‌కు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎన్‌ఓసీ జారీ చేసింది. ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాతో పాటు జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ సీఈఓ వినయ్‌ దూబేకు ఆకాశ ఎయిర్‌లో వాటాలున్న విషయం తెలిసిందే. ఆకాశ ఎయిర్‌కు సీఈఓగా వినయ్‌ దూబే బాధ్యతలు నిర్వర్తించే అవకాశమున్నట్లు వినవస్తోంది.


వచ్చే ఏడాది వేసవి నుంచి దేశంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆకాశ ఎయిర్‌ ప్రయత్నిస్తోంది. ఆకాశ ఎయిర్‌ బోర్డులో ఉన్న ఇండిగో మాజీ ప్రెసిడెంట్‌ ఆదిత్య ఘోష్‌... రానున్న నాలుగేళ్ళలో దాదాపు 70 విమానాలను నడిపేందుకు కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్్నారు. సర్వీసులకు సంబంధించి ఇప్పటికే ఎయిర్‌బస్‌, బోయింగ్‌లతో ఆకాశ ఎయిర్‌ ఇప్పటికే చర్చలు జరిపింది. 

Updated Date - 2021-10-13T01:37:11+05:30 IST