ఆందోళన వద్దు.. అవి పులి అడుగులు కాదు!
ABN , First Publish Date - 2021-06-13T05:15:57+05:30 IST
మండలంలోని ధర్మోరా గ్రామ సమీపంలో కనిపించినవి పులి అడుగులు కావని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లే దని కమ్మర్పల్లి అటవీ శాఖ అధికారి పద్మప్రియ అన్నారు.
మోర్తాడ్, జూన్ 12: మండలంలోని ధర్మోరా గ్రామ సమీపంలో కనిపించినవి పులి అడుగులు కావని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లే దని కమ్మర్పల్లి అటవీ శాఖ అధికారి పద్మప్రియ అన్నారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఆమె శనివా రం అటవీ శాఖ సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని పరి శీలించారు. స్థానిక రైతు.. పులి పడుకొని ఉండగా చూ శానని గ్రామంలో చెప్పడంతో గ్రామస్థులు ఆ ప్రాంతా న్ని పరిశీలించారు. కాగా, పులి అడుగులను పోలిన ఆన వాళ్లు ఉండడంతో అటవీ శాఖ అధికారులకు సమాచా రం అందించారు. దీంతో ఆ శాఖ అధికారి పద్మప్రియ తన సిబ్బందితో పాటు గ్రామస్థులతో కలిసి ఆ ప్రాంతా న్ని పరిశీలించారు. కాగా.. ఆ అడుగులను పరిశీలి ంచి అవి పులి అడుగులు కావని స్పష్టం చేశా రు. పులి పాదానికి తొమ్మిది వేళ్లు ఉంటాయని ఆమె వివరించారు. ఈ అడుగులు ఏ జంతువు తెలియాలని ఫొటోలు తీశామని, వాటిని పరిశోధన కేంద్రానికి పంపి నిర్ధారి స్తామని గ్రామస్థులకు తెలిపారు. గ్రామస్థులు భయపడవద్దని అధికారులు సూచించారు. అధికారుల వెంట సర్పంచ్ రాజేశ్వర్, ఫారెస్టు అధికారి రవి కుమార్, రైతులు పాల్గొన్నారు.