ఎన్నికల్లో డబ్బు తీసుకున్నారు కదా.. పంటలకు నీళ్లు రావు పోండి!
ABN , First Publish Date - 2020-02-20T10:09:26+05:30 IST
‘‘సర్పంచ్ ఎన్నికల్లో డబ్బు తీసుకోకుండా ఓటేశారా? డబ్బులు తీసుకుని తప్పు చేశారు.. పంటలకు నీళ్లు రావు పోండి’’ అంటూ మద్దూరు మండలంలోని
కొండాపూర్ రైతులపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫైర్
మద్దూరు: ‘‘సర్పంచ్ ఎన్నికల్లో డబ్బు తీసుకోకుండా ఓటేశారా? డబ్బులు తీసుకుని తప్పు చేశారు.. పంటలకు నీళ్లు రావు పోండి’’ అంటూ మద్దూరు మండలంలోని కొండాపూర్ గ్రామ రైతులపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విరుచుకుపడ్డారు. మొగోని లెక్క తప్పు ఒప్పుకొంటే రెండు పంటలకు నీళ్లు ఇస్తానని అన్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో పాటు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హజరయ్యారు. ఈ సందర్భంగాకూటిగల్ నల్ల చెరువులో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, చెరువును నీటితో నింపాలని ఎమ్మెల్యేను కోరగా... పై విధంగా వ్యాఖ్యానించారు.