లాక్డౌన్ పొడగిస్తున్నట్లు మోదీ చెప్పలేదు. మరి ఈ వార్త ఎక్కడిది?
ABN , First Publish Date - 2020-04-04T23:46:56+05:30 IST
ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ను మే 4 వరకు మోదీ ప్రకటించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడిన వీడియోకు సంబంధించిన ఓ ఇమేజ్ను మార్ఫింగ్ చేసి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ను నివారించేందుకు ఏప్రిల్ 14 వరకు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్డౌన్ను పొడగిస్తున్నట్లు మోదీ ప్రకటించారని ఓ వార్త ప్రచారం అవుతోంది. ఓ జాతీయ మీడియా టీవీలో ఇది ప్రసారమైనట్లు ఒక ఇమేజ్ చూస్తే అర్థమవుతోంది. అయితే అది పూర్తిగా తప్పుడు వార్త అని, కేంద్ర ప్రభుత్వం నుంచి అలాంటి ప్రకటన ఏదీ రాలేదని పీఐబీ పేర్కొంది.
విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ను మే 4 వరకు మోదీ ప్రకటించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడిన వీడియోకు సంబంధించిన ఓ ఇమేజ్ను మార్ఫింగ్ చేసి కొందరు ఇలా ప్రచారం చేస్తున్నారు. ఓ జాతీయ చానల్లో ఇది ప్రసారమైనట్లు ఆ ఇమేజ్లో ఉంది. బాగా పేరున్న జాతీయ చానల్ కావడంతో ఎక్కువ మంది నిజమే అనుకునే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఇది ఎంత మాత్రమూ నిజం కాదని పీఐబీ పేర్కొంది. లాక్డౌన్ పొడగింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనలు రాలేదని చెప్పింది.