ఇక్కడ వెలవెల.. అక్కడ కళకళ
ABN , First Publish Date - 2021-01-16T05:46:19+05:30 IST
నగరం బోసిపోయింది. పండక్కి అత్యధికులు సొంతూళ్లకు వెళ్లడంతో శుక్రవారం రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి.
నగరం బోసిపోయింది. పండక్కి అత్యధికులు సొంతూళ్లకు వెళ్లడంతో శుక్రవారం రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. జగదాంబ కూడలి, మద్దిలపాలెం, సిరిపురం, ఆశీల్మెట్ట తప్ప నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో దుకాణాలు కూడా మూతపడ్డాయి. అయితే గురు, శుక్రవారాల్లో నగరంలో ఉన్నవారితో పాటు పొరుగూరు నుంచి వచ్చిన వారి బంధువులు సాయంత్రం బీచ్కు రావడంతో ఆ ప్రాంతమంతా సదండిగా మారింది. పార్కు హోటల్ జంక్షన్ నుంచి గోకుల్ పార్కు వరకు ఆర్కే బీచ్రోడ్డు జనంతో కిక్కిరిసిపోయింది. అలాగే జంతుప్రదర్శనశాలకు కూడా జనం పోటెత్తారు.
- విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి