గాలికి వదిలేసిన నిబంధనలు
ABN , First Publish Date - 2020-05-25T10:28:00+05:30 IST
అధికారులు నిర్ణయించిన నిబంధనలు వ్యాపారులు గాలికి వదిలేశారు. ఫలితంగా ఎలాంటి మాస్క్లు, హ్యాండ్ గ్లౌజులు, చివరికి శానిటైజర్ ..
మైదుకూరు రూరల్, మే24: అధికారులు నిర్ణయించిన నిబంధనలు వ్యాపారులు గాలికి వదిలేశారు. ఫలితంగా ఎలాంటి మాస్క్లు, హ్యాండ్ గ్లౌజులు, చివరికి శానిటైజర్ కూడా లేకుండా చికెన్ వ్యాపారం నిర్వహిం చారు. అంతేకాకుండా పట్టణంలో మాంసం వ్యాపారులు ధరలు అమాం తం పెంచి వినియోగదారులను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు న్నాయి. దుకాణాలు వద్ద భౌతిక దూరం పాటించకుండా విచ్చల విడిగా జనాలు బారులు తీరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్య లు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కోళ్లను కోసే వారు గుట్కా నములుతూ ఉమ్మి వేస్తూ అక్కడే కోళ్లను కోస్తూ అపరిశుభ్రంగా తయా రు చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడం ఇందుకు కారణము.
పులివెందుల రూరల్, మే 24: పులివెందులలో మాంసం దుకాణాల వద్ద కరోనా నిబంధనలు ఏమాత్రం కనిపించ లేదు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భౌతిక దూరం, ముఖానికి మాస్కు, శానిటైజర్లతో శుభ్రం చేసుకోవడం ఒక్కటే మార్గమని ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్నా వ్యాపారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఇదిలా ఉంటే చికెన్, మటన్ ధరలు ఆకాశాన్నంటాయి. కిలో చికెన్ రూ. 250, మటన్ కిలో రూ. 700 విక్రయించారు. ఈ ధరలతో సామాన్యులు వెనుదిరగక తప్పలేదు.