దిశ బిల్లుపై ఏపీ నుంచి స్పందన రాలేదు
ABN , First Publish Date - 2021-07-28T00:32:32+05:30 IST
ఏపీలోని మహిళల రక్షణ కోసిం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లుపై తమ
ఢిల్లీ: ఏపీలోని మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లుపై తమ అభ్యంతరాలకు ఏపీ ప్రభుత్వం నుంచి తిరిగి స్పందన రాలేదని లోక్సభలో హోంశాఖ తెలిపింది. లోక్సభలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్కుమార్ మిశ్రా సమాధానం ఇచ్చారు. రాష్ట్రం పంపిన దిశ బిల్లుపై తమ అభ్యంతరాలను హోంశాఖ మంత్రిత్వశాఖ లేవనెత్తింది. దీంతో పలు అంశాలపై వివరణ కోరినట్లు హోంశాఖ పేర్కొంది. తాము లేవనెత్తిన అభ్యంతరాలకు, వివరణలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పేర్కొన్నారు.