అమృత్ మహోత్సవ్ ఫ్లెక్సీకి స్థానం కరువాయె!
ABN , First Publish Date - 2022-08-07T05:26:51+05:30 IST
అమృత్ మహోత్సవాల్లో భాగం స్థానిక మండల కార్యాలయ భవన ప్రాంగణంలో ప్రభుత్వ ఫ్లెక్సీ కూడా కట్టుకునేందుకు స్థానం కరువైంది.
అధికార పార్టీ ఫ్లెక్సీలతో నిండిపోయిన ప్రాంగణం
ఇందుకూరుపేట, ఆగస్టు 6 : అమృత్ మహోత్సవాల్లో భాగం స్థానిక మండల కార్యాలయ భవన ప్రాంగణంలో ప్రభుత్వ ఫ్లెక్సీ కూడా కట్టుకునేందుకు స్థానం కరువైంది. ప్రాంగణమంతా వైసీపీ నాయకుల ఫ్లెక్సీలతో నిండిపోయింది. దీంతో ఆజాదీకా అమృత్ మహోత్సవ్, ఇంటింటికి త్రివర్ణ పతాకం, మహాత్మాగాంధీ ఫొటోతో కూడిన ఫ్లెక్సీలకు చివరరి స్థానం లేకపోవడంతో కొబ్బరితోటల ప్రహారీ వద్ద ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. వైసీపీ నాయకుల ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశాలను ఇచ్చేందుకు ఎంపీడీవో వెనుకాడుతున్నారు. వైసీపలో మూడు వర్గాలు, ముగ్గురు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడంతో అధికారులు మౌనం వహించారు. ఒక నాయకుడిని తీయమంటే కోపాలు, అలకలతో ఇబ్బందులు వస్తాయని ఆలోచిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.