ఫ్రెండే కదా అని.. ఆ బాలిక రోజూ వాళ్లింటికి వెళ్లేది.. స్నేహితురాలి తల్లి.. చివరకు ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు..

ABN , First Publish Date - 2021-11-20T22:19:50+05:30 IST

స్నేహితురాలి కుటుంబ సభ్యుల కారణంగా అనుకోని సమస్యలు వచ్చి పడ్డాయి. తోటి స్నేహితురాలే కదా అని ఓ బాలిక.. రోజూ వాళ్లింటికి వెళ్తూ ఉండేది. అయితే చివరకు స్వయానా స్నేహితురాలి తల్లే.. ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు.

ఫ్రెండే కదా అని.. ఆ బాలిక రోజూ వాళ్లింటికి వెళ్లేది.. స్నేహితురాలి తల్లి.. చివరకు ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు..

స్నేహితుల మధ్య ఎంత అనుబంధం ఉంటుందో.. వారి కుటుంబాల మధ్య కూడా దాదాపు అంతే అనుబంధం ఉంటుంది. ఎవరింట్లో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా స్నేహితులు.. బంధువుల్లా వెళ్లిరావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బంధువుల కంటే స్నేహితులకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే కొన్ని ఘటనల్లో మాత్రం వివిధ కారణాలతో స్నేహితుల మధ్య చిచ్చు పుడుతూ ఉంటుంది. మనం చెప్పుకోబోయే ఘటనలో మాత్రం.. స్నేహితురాలు కుటుంబ సభ్యుల కారణంగా అనుకోని సమస్యలు వచ్చి పడ్డాయి. తోటి స్నేహితురాలే కదా అని ఓ బాలిక.. రోజూ వాళ్లింటికి వెళ్తూ ఉండేది. అయితే చివరకు స్వయానా స్నేహితురాలి తల్లే.. ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు. వివరాల్లోకి వెళితే..


తమిళనాడు శివగంగ జిల్లా కరైకుడికి చెందిన ఓ బాలిక ప్రభుత్వ కళాశాలలో 12వ తరగతి చదువుతోంది. క్లాసులో మరో బాలికతో ఈమెకు స్నేహం కుదిరింది. రోజూ ఇద్దరూ కలిసి కళాశాలకు వెళ్లి రావడం, కలిసే చదువుకోవడం చేస్తుండేవారు. ఈ క్రమంలో వారి మధ్య స్నేహం మరింత బలపడింది. ఈ చనువుతో అప్పుడప్పుడూ స్నేహితురాలి ఇంటికి కూడా వెళ్తూ ఉండేది. ఈ క్రమంలో స్నేహితురాలి తల్లి అరంతంగితో కూడా చాలా చనువుగా ఉండేది. ఆ మహిళ ఓ బ్యూటీఫార్లర్‌‌లో మేనేజర్‌గా పని చేస్తోంది. దీంతో కరైకుడికి చెందిన బాలిక.. తరచూ బ్యూటీఫార్లర్‌కు వెళ్లి వచ్చేది.


ఇలావుండగా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన మంజిల్ ఛెత్రీ అనే వ్యక్తి (బ్యూటీ పార్లర్ నిర్వాహకుడు) బాలికపై కన్నేశాడు. ఎలాగైనా అనుభవించాలని అనుకున్నాడు. బ్యూటీఫార్లర్‌ మేనేజర్ అయిన అరంతంగికి అదే విషయం చెప్పాడు. తనకు పరిచయం చేయాలని చెప్పగానే, ఆమె కూడా అందుకు అంగీకరించింది. బాలికతో రోజూ మాయ మాటలు చెప్పి, సెలూన్ ఓనర్‌‌కు దగ్గర చేసింది. బాలిక బలహీనతను అవకాశంగా తీసుకున్న అతడు.. రోజూ డబ్బులు ఇస్తూ, మంచి మంచి ప్రదేశాలను చూపిస్తూ, మంచి మాటలు చెబుతూ దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఓ రోజు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బ్యూటీఫార్లర్‌లో పని చేసే.. విఘ్నేష్, చిరంజీవి, హరీష్ అనే యువకులు కూడా బాలికపై కన్నేశారు. వారు కూడా ఈమెపై అత్యాచారానికి ఒడిగట్టేవారు.


వారి మాయలో పడిన బాలిక.. రోజూ కళాశాలకు వెళ్తున్నానని చెబుతూ, బ్యూటీఫార్లర్‌కు వెళ్లేది. కళాశాలకు సక్రమంగా రాకపోవడంతో ప్రిన్సిపాల్‌కు అనుమానం వచ్చి, బాలిక తండ్రికి ఫోన్ చేశాడు. బాలిక ప్రవర్తనను గమనించిన తండ్రి.. ఓ గట్టిగా మందలించడంతో విషయం బయటపడింది. తన కూతురిపై జరిగిన దారుణంపై.. కరైకుడి మహిళా పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహిళతో సహా మంజిల్, విఘ్నేష్, చిరంజీవి, హరీష్, మరొకరిపై కేసు నమోదు చేశారు. వీరిలో మంజిల్, హరీష్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Updated Date - 2021-11-20T22:19:50+05:30 IST