నన్ను అడ్డుకోలేరు.. నేను తగ్గేది లేదు : చంద్రబాబు
ABN , First Publish Date - 2021-03-01T17:55:39+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును తిరుపతిలోని రేణిగుంట..
చిత్తూరు : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును తిరుపతిలోని రేణిగుంట ఎయిర్పోర్టులో పోలీసులు అడ్డుకున్న విషయం విదితమే. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ ఎయిర్పోర్టులోనే బాబు బైఠాయించారు. ఈ మొత్తం వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘నన్ను అడ్డుకోలేరు.. నేను తగ్గేది లేదు. నన్ను ప్రజల్ని కలవనీయకుండా ఆపటం తగదు. భయంతో ఎన్ని రోజులు పాలన సాగిస్తావు?. ఇకనైనా జగన్ ఎదగాలి’ అని సీఎంపై ట్విట్టర్లో చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే ఎయిర్పోర్టు బయట.. ఏపీలో పలు చోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.