7 ఏళ్లలో ఎవరూ వేలెత్తి చూపలేదు: రాజ్నాథ్ సింగ్
ABN , First Publish Date - 2021-11-25T21:36:13+05:30 IST
ఏడేళ్ల పాలన పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క అవినీతి మచ్చ తమ ప్రభుత్వానికి పడలేదని, ఇప్పటి వరకు ఎవరూ తమను వేలెత్తి చూపించలేదని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. గురువారం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో..
లఖ్నవూ: ఏడేళ్ల పాలన పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క అవినీతి మచ్చ తమ ప్రభుత్వానికి పడలేదని, ఇప్పటి వరకు ఎవరూ తమను వేలెత్తి చూపించలేదని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. గురువారం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
‘‘ఈ దేశంలో అత్యంత నిజాయితీ కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే. ప్రజా సేవ చేసేందుకే బీజేపీ పని చేస్తుంది. అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తైనా అవినీతి విషయంలో ఇప్పటి వరకు మనల్ని (బీజేపీ కార్యకర్తల్ని ఉద్దేశించి) ఎవరూ వేలెత్తి చూపించలేదు. ఒక్క బీజేపీ నేత కూడా అవినీతిలో ఇరుక్కున్నట్లు, అవినీతికి సహకరించినట్లు ఎవరూ ప్రశ్నించలేదు’’ అని రాజ్నాథ్ అన్నారు.