ముసలోళ్లు పోతారుఎవరూ ఆపలేరు: బీజేపీ మంత్రి
ABN , First Publish Date - 2021-04-16T07:16:00+05:30 IST
కరోనా నేపథ్యంలో మధ్యప్రదేశ్ని బీజేపీ నాయకుల తీరు వివాదాస్పదమవుతోంది. మంత్రి
భోపాల్, ఏప్రిల్ 15: కరోనా నేపథ్యంలో మధ్యప్రదేశ్ని బీజేపీ నాయకుల తీరు వివాదాస్పదమవుతోంది. మంత్రి ప్రేమ్సింగ్ పటేల్ చేసిన బాధ్యతారహిత వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మాస్కులు ధరించడం, సామాజికదూరం పాటించడం వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విన్నవించారు. మధ్యప్రదేశ్లో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా మరణాల గురించి ప్రశ్నించగా..‘‘వృద్ధులది చనిపోయే వయసు.. వారు చనిపోతారు. కరోనా చావుల్ని ఎవరూ ఆపలేరు’’ అని వ్యాఖ్యానించారు.
షాదోల్ జిల్లాలో లాక్డౌన్ అమలులో ఉండగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కమల్ ప్రతాప్ తన పుట్టినరోజును పెద్ద సంఖ్యలోని జనాల మధ్య.. ఎలాంటి జాగ్రత్తలూ పాటించకుండా చేసుకొన్నారు. మరోవైపు.. తన తండ్రికి ఉద్దేశపూర్వకంగానే ఆస్పత్రి సిబ్బంది ఆక్సిజన్ తొలగించారని.. దాంతో ఆయన మృతి చెందారని శివ్పురికి చెందిన దీపక్ తివారీ ఆరోపించారు.