కొత్త పన్నులు వేయం: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-01-29T22:48:07+05:30 IST

పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే కొత్త పన్నులేవీ విధించేది లేదని ఆ పార్టీ కన్వీనర్..

కొత్త పన్నులు వేయం: కేజ్రీవాల్

జలంధర్: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే కొత్త పన్నులేవీ విధించేది లేదని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. జలంధర్‌లో జరిగిన పొలిటికల్ ర్యాలీని ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఢిల్లీలో తమ ప్రభుత్వం అనుసరిస్తున్న తరహాలోనే  పంజాబ్‌లో కూడా బడ్జెట్ రూపొందిస్తామని, బడ్జెట్ తయారు చేయడానికి ముందు సాధారణ ప్రజానీకం, ముఖ్యంగా ట్రేడర్లు, వాణిజ్యవేత్తలు, రైతులు, శ్రామికులు, మహిళలు, యువకులు, ఉద్యోగులతో సహా అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే బడ్జెట్ రూపకల్పన చేస్తామని, అన్ని వర్గాల సమస్యలకు పరిష్కారం బడ్జెట్‌లో ఉంటుందని చెప్పారు. పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న ఉంటుంది.

Updated Date - 2022-01-29T22:48:07+05:30 IST