అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు.. దూబే ఎన్‌కౌంటర్‌పై పోలీసులు

ABN , First Publish Date - 2020-07-12T04:05:35+05:30 IST

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్ విషయంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు.. దూబే ఎన్‌కౌంటర్‌పై పోలీసులు

లక్నో: గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్ విషయంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. తాము అందరికీ ఎందుకు సమాధానాలు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తాము సమాధానాలు చెప్పాల్సిన వారికి వివరాలన్నీ ఇస్తామని, అంతేగానీ అందరికీ సమాధానాలు చెప్పుకుంటూ పోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. ‘ఈ ఘటనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ అందరికీ వివరించాల్సిన అవసరం లేదు’ అని ప్రశాంత్ కుమార్ స్పష్టంచేశారు.

Updated Date - 2020-07-12T04:05:35+05:30 IST