12గంటల పని విధానం వద్దు

ABN , First Publish Date - 2022-07-02T05:55:10+05:30 IST

కేంద్రప్రభుత్వం తీసుకు వస్తున్న 12గంటల పని విధానానికి వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదు ట ధర్నా జరిగింది. ఈ సందర్భంగా నాయకులు సుబ్రమణ్యం, మంజునాథ్‌ బాబు మాట్లాడుతూ... ప్రాణ త్యాగం చేసి కార్మికులు సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని తుంగలో తొక్కడానికి కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.

12గంటల పని విధానం వద్దు

ఆర్డీవో కార్యాలయం ఎదుట సీఐటీయూ ధర్నా


పలమనేరు, జూలై 1: కేంద్రప్రభుత్వం తీసుకు వస్తున్న 12గంటల పని విధానానికి వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదు ట ధర్నా జరిగింది. ఈ సందర్భంగా నాయకులు సుబ్రమణ్యం, మంజునాథ్‌ బాబు మాట్లాడుతూ... ప్రాణ త్యాగం చేసి కార్మికులు సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని తుంగలో తొక్కడానికి కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. కార్మిక చట్టాలను, హక్కులను కాలరాయడానికి, బడా కార్పొరేట్‌ శక్తులకు కార్మికుల శ్రమశక్తిని అమ్ముకోవడానికి బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. అనంతరం  ఆర్డీవో కార్యాలయ ఏవోకు వినతిపత్రం అందించారు.  శ్రీనివాసులు, మురళి, బాలాజి, మధు, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T05:55:10+05:30 IST