కనీస వసతులులేవు..బాధితుల గోడు..

ABN , First Publish Date - 2020-09-30T18:41:14+05:30 IST

నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో కనీస వసతులు లేవని..

కనీస వసతులులేవు..బాధితుల గోడు..

విజయవాడ: నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో కనీస వసతులు లేవని, ఆహారం సరిగా అందించడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు వస్తున్నట్లు అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు. అర్ధరాత్రి ఇళ్లల్లోకి నీరు రావడంతో అందిన సామాగ్రితో బయటకు వచ్చామన్నారు. నాశిరకంగా అల్పాహారం, భోజనం ఉంటుందని, పెట్టిందే తినాలని అధికారులు చెబుతున్నారని బాధితులు వాపోయారు. కట్టు బట్టలతో వచ్చామని, సరైన బాత్ రూమ్‌లు లేవని చాలా ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు కూడా పట్టించుకోవడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-09-30T18:41:14+05:30 IST