మాస్కు ధరించని 772 మందిపై కేసులు

ABN , First Publish Date - 2022-02-22T17:05:29+05:30 IST

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో మాస్కులు ధరించని 772 మంది నుంచి రూ.3.14 లక్షల జరిమానా వసూలుచేశారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ ఉత్తర్వులతో, నగర వ్యాప్తంగా ప్రత్యేక

మాస్కు ధరించని 772 మందిపై కేసులు

                                - రూ.3.14 లక్షల జరిమానా


పెరంబూర్‌(చెన్నై): గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో మాస్కులు ధరించని 772 మంది నుంచి రూ.3.14 లక్షల జరిమానా వసూలుచేశారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ ఉత్తర్వులతో, నగర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు కొవిడ్‌ నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా నిఘా వేశారు. ఈ నెల 14 నుంచి 20వ తేది వరకు మాస్కు ధరించకుండా బహిరంగ ప్రాంతాల్లో సంచరిస్తున్న 772 మందిపై కేసులు నమోదుచేసి రూ.3.14 లక్షలు, భౌతిక దూరం పాటించని ఇద్దరి నుంచి తలా రూ.500 జరిమానా వసూలుచేసినట్లు తెలిపింది. అలాగే, నిబంధనలు అతిక్రమించిన 225 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు శాఖ తెలిపింది.

Updated Date - 2022-02-22T17:05:29+05:30 IST