వికారాబాద్: విందులో లాక్ డౌన్ అంక్షలు భేఖాతరు ?

ABN , First Publish Date - 2021-06-15T02:36:03+05:30 IST

లాక్ డౌన్ అంక్షలను భేఖాతరు చేస్తూ విందు నిర్వహించిన రాజకీయ నాయకుడి

వికారాబాద్: విందులో లాక్ డౌన్ అంక్షలు భేఖాతరు ?

వికారాబాద్: లాక్ డౌన్ ఆంక్షలను భేఖాతరు చేస్తూ విందు నిర్వహించిన రాజకీయ నాయకుడి నిర్వాకం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిగి దోమ మండలంలోని దిర్సంపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాక్ డౌన్ ఆంక్షలను తుంగలో తొక్కిన ఓ రాజకీయ నేత వందల మందితో విందు ఏర్పాటు చేసాడు. ఇంత జరుగుతున్నా పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారు.




జూన్ 11న రాత్రి 9 నుంచి ఉదయం వరకు రికార్డు డ్యాన్స్‌లు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొగులయ్య అనే నాయకుడు గ్రామంలో అర్థనగ్న నృత్యాలు చేసినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ విషయం గురించి తెలిసి కూడా స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది చూసి చూడనట్లు వ్యవహరించారని ప్రజలు విమర్శిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన సదరు నేతపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2021-06-15T02:36:03+05:30 IST