50 ఏళ్లు దాటితే ఇన్విజిలేషన్‌ డ్యూటీలు వద్దు

ABN , First Publish Date - 2020-06-04T09:10:31+05:30 IST

కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలకు 50 ఏళ్లు పైబడిన ఉపాధ్యాయులకు ఇన్విజిలేషన్‌ డ్యూటీలు వేయవద్దని ఎమ్మెల్సీ రఘువర్మకు ..

50 ఏళ్లు దాటితే ఇన్విజిలేషన్‌ డ్యూటీలు వద్దు

ఎమ్మెల్సీ రఘువర్మకు ఉపాధ్యాయుల వినతి


చోడవరం: కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలకు 50 ఏళ్లు పైబడిన ఉపాధ్యాయులకు ఇన్విజిలేషన్‌ డ్యూటీలు వేయవద్దని ఎమ్మెల్సీ రఘువర్మకు ఏపీటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. బుధవారం చోడవరం వచ్చిన ఆయనకు వినతిపత్రం అందజేశారు. పాఠశాలలు తెరిచేలోగా బదిలీలు చేపట్టాలని, పదోన్నతులు కల్పించాలని, నాడు-నేడు, మనబడి కార్యక్రమాల్లో ఉపాధ్యాయుల పాత్ర తగ్గించాలని కోరారు. ఈ సమస్యలపై ఎంఈవో తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ రఘువర్మ సూచించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ నాయకులు గొల్లు శ్రీనివాసరావు, ఎం.మహలక్ష్మీనాయుడు, ఎల్‌.కొండలరావు, సత్యనారాయణ, జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-04T09:10:31+05:30 IST